Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతి

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:41 IST)
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ఘోర ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. గుంటూరులోని శావల్యాపురం మండలంలోని బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
 
కనకమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారును ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలూరుకు చెందిన ఉదయ్, నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
 
మరో ఐదుగురు తీవ్ర గాయాలయ్యారు. గాయపడ్డ వారందరినీ వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments