Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు .. ఇద్దరు మృతి ... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 7 జనవరి 2024 (12:29 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం మోచర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా, డ్రైవర్‌ వినోద్‌ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. వీరిలో సీతమ్మ (65) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. టీఎస్‌ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments