Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు- ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఏ1), అనీఖ్ షఫీఖ్‌ సయ్యద్‌ (ఏ2)

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:25 IST)
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఏ1), అనీఖ్ షఫీఖ్‌ సయ్యద్‌ (ఏ2) దోషులుగా ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 
 
అనీక్‌ షఫీక్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ను దోషులుగా నిర్థారిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరికి శిక్షలపై సోమవారం తీర్పు ప్రకటించనున్నారు. సరైన ఆధారాలు లేనందున ఫరూఖ్‌ షఫ్రుద్దీన్‌, సాధిక్‌ ఇసార్‌, అంజుమ్‌లను నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.
 
కాగా, 2007 ఆగస్టు 25న నిమిషాల వ్యవధిలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 42 మంది మృతిచెందగా 70 మందికి పైగా గాయాల పాలైయ్యారు. ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్‌ బృందం తేల్చింది. 
 
రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌ సహా పలువురిని నిందితులుగా చార్జిషీట్ దాఖలు చేశారు. వీరిలో అరెస్టైన వారిలో ఐదుగురు చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆగస్టు 27వ తేదీన తుది విచారణ జరిపిన కోర్టు, సెప్టెంబర్ నాలుగో తేదీన (మంగళవారం) తుది తీర్పు వెలువరించింది. 
 
ఈ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రియాజ్ భత్కల్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఈ ఘటనకు సంబంధించిన 286 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1125 పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. మూడు విడతలుగా చార్జీషీటును దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments