Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ‌లో రెండు చోరీ కేసులు ఛేదించిన పోలీసులు.. భారీగా న‌గ‌దు, న‌గ‌లు స్వాధీనం

Webdunia
బుధవారం, 1 జులై 2020 (12:03 IST)
విజ‌య‌వాడ న‌గ‌ర ప‌రిధిలో ఇటీవల జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. జూన్ 1న  విజయవాడ వన్‌టౌన్‌లోని బంగారం షాపు యజమాని ఇంట్లో చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రూ.56.65 లక్షల విలువైన 1225 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు మహారాష్ట్రకు చెందిన ఆమోల్ వసంత్ పటేల్, శైలేష్ పాటిల్‌గా పోలీసులు గుర్తించారు. వీరు ఇరువురూ ఫిర్యాదిదారుడికి చెందిన బంగారం దుకాణంలో పనిచేస్తుండేవారు. అలాగే ఉయ్యూరు పట్టణంలో జరిగిన చోరీ కేసులో నిందితుడుని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

చోరీ కాబడిన రూ.77.50 లక్షలకు గాను రూ.33.84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుబిలి సుబ్రహ్మణ్యం గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడ‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు త‌మ ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా ఆయా రెండు కేసుల్లో నిందితులను పట్టుకుని, చోరీ కాబడిన సొత్తును స్వాధీనం చేసుకోవడంలో సమర్ధంగా వ్యవహరించిన వన్‌టౌన్ సీఐ పి.వెంకటేశ్వర్లు, ఎస్సై బి.శంకరరావు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ ఎస్వీవీఎస్ మూర్తి తదితరుల‌ను సీపీ శ్రీనివాసులు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments