తుంగభద్ర నది ఉరకలెత్తుతోంది.. నదీతీర గ్రామాలకు హెచ్చరిక..

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (13:42 IST)
తుంగభద్ర నది ఉరకలెత్తుతోంది. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో సైతం 1,55,431 క్యూసెక్కులు ఉండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
 
మంగళవారం వరద పోటు పెరిగే సూచనలు ఉండటంతో 2 లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశం ఉందని తుంగభద్ర బోర్డ్ సెక్షన్ అధికారి విశ్వనాథ్ చెప్పారు. డ్యాంలో ప్రస్తుతం 100.663 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు. తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీరు బుధవారం నాటికి ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుకోనుంది. అక్కడి నుంచి సుంకేసుల బ్యారేజీకి వరద చేరుకునే అవకాశం ఉందని ఆర్డీఎస్ అధికారులు చెబుతున్నారు. 
 
నదీతీర గ్రామాలకు హెచ్చరిక.. 
తుంగభద్ర డ్యాం నుంచి 33 గేట్ల ద్వారా 1,55,431 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేయడంతో తెలంగాణ, ఏపీ, కర్ణాటక అధికారులను అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డ్ హెచ్చరిక జారీ చేసింది. ఆయా రాష్ట్రాల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇరిగేషన్, రెవిన్యూ యంత్రాగానికి ఉత్తర్వులు జారీ చేసింది. తుంగభద్ర నదితీర ప్రాంత ప్రజలను నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments