Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడి గుండెపోటు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (09:54 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు కార్యనిర్వాహక అధికారి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 28 యేళ్ల చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామికవేత్త, తితిదే చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి ఏకైక కుమార్తెతో వివాహం నిశ్చియమైంది. కొన్ని రోజుల క్రితమే ఈ వివాహం జరిగింది. వీరి వివాహం జనవరిలో తిరుమలలో అంగరంగం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులోభాగంగా, ఇరు కుటుంబాల సభ్యులు శుభలేఖలు పంచుతున్నారు.
 
ఈ నేపథ్యంలోని చెన్నైలోని తమ బంధువులకు శుభలేఖలు ఇచ్చేందుకు చంద్రమౌళి తన స్నేహితులతో కలిసి చెన్నైకు వచ్చారు. ఆయనకు ఆదివారం కారులో వెళుతుండగా గుండెనొప్పిగా ఉన్నట్టు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ వెంటనే చెన్నైలో ఉండే శేఖర్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. ధర్మారెడ్డి దంపతులు సాయంత్రానికి ఆస్ప్తరికి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments