Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటన్నర వ్యవధిలోనే శ్రీవారి భక్తులకు సర్వదర్శనం : ఈవో ధర్మారెడ్డి

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (09:32 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే సర్వదర్శన భక్తులకు కేవలం గంటన్నర వ్యవధిలోనే దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించినట్టు చెప్పారు. 
 
ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ, సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. అదేసమయంలో శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని చెప్పారు. 
 
తిరుమల కొండవై దళారీ వ్యవస్థను నిరోధించడం ద్వారా రూ.215 కోట్లు శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా స్వామివారికి చేరుతున్నాయన్నారు. గత రెండున్నరేళ్ళలో రూ.1500 కోట్ల విరాళాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. 
 
తిరుమలలో 7500 గదులకు 40 యేళ్లుగా మరమ్మతులు చేయలేదని, కానీ కరోనా కాలంలో 4500 గదులకు మరమ్మతులు చేసినట్టు చెప్పారు. వచ్చే సెప్టెంబరు నాటికి మిగిలిన గదులకు కూడా మరమ్మతులు చేస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments