Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొడ్డిదారిన పదవులు దక్కించుకోలేదు... నా సొంత డబ్బులే ఖర్చు చేస్తా : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
బుధవారం, 17 జులై 2019 (17:43 IST)
మాజీ మంత్రి నారా లోకేశ్‌పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాను దొడ్డిదారిన పదవిలోకి రాలేదన్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోనని, అవసరమైతే తన డబ్బే ఖర్చు చేస్తానంటూ ప్రకటించారు. 
 
అమరావతిలో తితిదే ఛైర్మన్‌కు క్యాంపు కార్యాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై పెద్ద వివాదమే చెలరేగింది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ, దేవుడు సొమ్మును స్వాహా చేయబోతున్నారంటూ విమర్శించారు. 
 
దీనికి వైబీ సుబ్బారెడ్డి స్పందించారు. 'ఈ అబ్బాకొడుకులు ఇద్దరూ రాష్ట్రమంతా దోచి పారేశారు. వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోను. అవసరమైతే నా జేబు నుంచి ఖర్చు చేస్తాను. మేము ఏమీ వాళ్లలాగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. మా ముఖ్యమంత్రి, మేము పదేళ్లు కష్టపడ్డాం.
 
ప్రజలకు మేలు చేయాలని వచ్చాం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దేవుడి సొమ్ము స్వాహా కాదు.. ఒక్క రూపాయి సొమ్మును వృథా కూడా కానివ్వబోం. నా ప్రయాణాలకు కూడా స్వామివారి సొమ్ము ఒక్క రూపాయి కూడా వాడను. అక్కసుతో బాధపడుతున్న ప్రతిపక్షాలన్నింటికి ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నా' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments