నాగార్జున సాగర్‌ను పేల్చేస్తాం... టెర్రరిస్టుల వార్నింగ్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (17:20 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందిస్తూ వస్తున్న నాగార్జన సాగర్ డ్యామ్‌ను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్‌ను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారనీ, అందువల్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. 
 
నాగార్జున సాగర్‌తో పాటు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంది. తెలంగాణలోని ఈ రెండు ప్రదేశాల్లో దాడులు జరగొచ్చని ఐబీ తెలిపింది. వీటితో పాటు ఢిల్లీ సహా 20 రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ పేర్కొంది. 
 
నేపాల్‌లో ఉగ్రదాడి తర్వాత సముద్ర మార్గం నుంచి భారత్‌కు కొందరు ఉగ్రవాదులు వచ్చారని.. మన దేశంలో దాడులు జరిపేందుకు వీరు సిద్ధమయ్యారని.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వీరు గురిపెట్టినట్లు అప్పట్లో ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
 
మరోవైపు ఐబీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే గతంలోనూ నాగార్జనుసాగర్‌కు పలుమార్లు ఉగ్ర హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments