Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించిన టీటీడీ ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (10:53 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు  దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మ‌న్ గా తిరిగి ప‌ద‌వి పొందిన సుబ్బారెడ్డి తొలిసారిగా అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు.

దుర్గ గుడిలో ఆయ‌న‌కు ఆలయ మర్యాదల‌తో స్వాగతం పలికారు. వేద పండితులు  ఆశీర్వచనాలు అందించారు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మ వారి ప్రసాదం, చిత్రపటం వై వి సుబ్బారెడ్డి దంపతుల‌కు అందజేశారు.
 
టీటీడీ ఛైర్మ‌న్  వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.

ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర‌ ప్రజలపై ఉండాలని కోరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల‌న్నీ సకాలంలో ప్రజలకు చేరాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని, కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్న‌ట్లు సుబ్బారెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments