Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడా, ఆ టిటిడి వసతి సముదాయాలన్నీ కరోనా బాధితుల కోసమే

Webdunia
బుధవారం, 15 జులై 2020 (22:00 IST)
కరోనా విజృంభిస్తోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులకే కరోనా సోకడం.. 91 మందికి అధికారికంగా కరోనా సోకినట్లు స్వయంగా టిటిడి ప్రకటించడం.. ఇక స్థానికుల్లో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుండటం ఇదంతా భక్తులను ఆందోళనకు గురిచేసే అంశంగా చెప్పుకోవాలి.
 
తిరుపతి లాంటి ప్రాంతాల్లో కరోనా బాధితుల కోసం టిటిడి కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసేసుకుంది. భక్తుల కోసం కట్టిన వసతి సముదాయాలను ఏకంగా కరోనా బాధితులకు అందిస్తోంది. ఇప్పటికే టిటిడి ఉద్యోగస్తుల కోసం శ్రీనివాసం, మాధవం లాంటి వసతి గృహాలను కేటాయిస్తే తాజాగా బర్డ్ ఆసుపత్రిని కోవిడ్ బాధితులకు అందించేందుకు సిద్ధమైంది టిటిడి.
 
అంతేకాకుండా విష్ణునివాసంలోని 400 పడకలను కూడా కోవిడ్ బాధితులకే వినియోగించనున్నారు. కలెక్టర్ కోరిక మేరకు టిటిడి వసతి సముదాయాలను కోవిడ్ బాధితులకే అందించేస్తున్నారు. త్వరలోనే ఈ వసతి సముదాయాలన్నీ ప్రభుత్వానికి అందించనున్నారు. భక్తుల కోసం కేటాయించిన వసతి సముదాయాలు కోవిడ్ బాధితులకు ఉపయోగిస్తుండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments