Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ సమ్మె వెనుక తెరాస నేతలు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (16:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే 10 రోజులు దాటిపోయాయి. అయినప్పటికీ అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏమాత్రం పట్టువిడుపుల ధోరణిని వీడటం లేదు. దీంతో సమ్మె కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. 
 
అయితే, ఈ ఆర్టీసీ సమ్మెపై అధికార తెరాస పార్టీకి చెందిన నేతలు కొందరు ఉన్నారంటూ తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారే ఈ సమ్మెకు ఆజ్యం పోశారని, ఈ విషయాన్ని తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని వెల్లడించారు. 
 
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తెరాస సర్కారును మరింతగా ఇరుకున పెడుతోంది. ఆయన కేసీఆర్‌కు ఎవరి పేర్లు చెబుతారోనన్న టెన్షన్ కొందరిలో నెలకొంది.
 
అయితే, ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు తెరాస నేతలు ఎవరూ స్పందించలేదు. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తెరాస సీనియర్ నేత కేశవరావు సోమవారం ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చర్చలు జరిగే అవకాశాలు చిగురించాయి. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇపుడు కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments