Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. కవిత.. నేడు నామినేషన్

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (11:31 IST)
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పేరు ఖరారైంది. ఆమె అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆమె బుధవారమే నామినేషన్ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. 
 
నిజామాబాద్ ఎంపీగా అయిదేళ్ల పాటు పనిచేసిన ఆమె అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కేడర్‌ను వెన్నంటి నడిపించారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కీలకమైన పదవిలో ఆమెకు అవకాశం ఉంటుందని జిల్లా నేతలు భావిస్తుండగా ఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన ఎమ్మెల్సీ పదవికి ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది.
 
రెండు జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడం వల్ల ఉభయ జిల్లాల్లో పట్టు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రి, స్పీకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మాజీ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 80 శాతంకు పైగా టీఆర్‌ఎస్‌ ఓటర్లే ఉండడం వల్ల గెలుపు కూడా సునాయసంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments