Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబ్ తుఫానుతో అత‌లాకుత‌లం... రోడ్లపై కూలిన చెట్లు!

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (10:54 IST)
గులాబ్ తుపాను తీరం దాట‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చాలా చోట్ల అత‌లాకుత‌లం అయిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్ల‌కు అడ్డంగా కుప్పకూలిన చెట్లు తొలిగింపు కార్యక్రమం గత అర్థరాత్రి నుండి చురుగ్గా సాగుతోంది. జాతీయ విపత్తుల నివారణ సంస్థ సిబ్బంది, రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు, శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది కలిసి యుద్ధప్రాతిపదికన చెట్లు తొలగిస్తున్నారు. రహదారికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.

గార,జి.సిగడం,పొలాకి,వజ్రపుకొత్తూరు, పలాస,సోంపేట,టెక్కలి,నరసన్నపేట లలో చెట్లు ఎక్కువ సంఖ్యలో కుప్పకూలాయి. తుఫాన్ తాకిడికి శ్రీకాకుళం జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తుఫాన్ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వొద్ద తీరం దాటిన సమయంలో 75 నుండి 90 కిలోమీటర్లు వరకు వేగంగా గాలులు వీచాయి.ఆ సమయంలో అనేక చోట్ల మహావృక్షాలు నేలకొరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్‌కు క్రేజ్ తగ్గిపోయినట్టేనా?

విశ్వం షూట్ లో ఫిజికల్ గా చాలెంజ్ లు ఎదుర్కొన్నా : కావ్యథాపర్

కొండా సురేఖపై విరుచుకుపడిన తెలుగు చిత్రపరిశ్రమ...

కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ ఆకట్టుకుంది : పరుచూరి వెంకటేశ్వరరావు

పవన్ గారూ.. గుడిలో ప్రసాదంతో పాటు మొక్కలు కూడా ఇవ్వండి : షాయాజీ షిండే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments