Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gulab cyclone landfall: తీరం దాటిన గులాబ్ తుపాను

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (10:44 IST)
గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య తీరం దాటిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో ఎపి వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉత్తరాంధ్రలో ఎక్కడికక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
 
గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూసపాటిరేగ, భోగాపురంలోని తీరప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. ముక్కాంలో సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. విజయనగరం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
 
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రతీర ప్రాంతాల్లో రెడ్‌ అలెర్టు ప్రకటించారు. కళింగపట్నం, విశాఖ, గంగవరం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.
 
వర్షం అతి భారీగా పడనుందని, పాత భవనాల్లో ఉన్నవారిని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపటుం జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్రంలోకి మత్స్యకారులు మరో రెండు రోజుల వరకూ వెళ్లద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
మత్స్యకార గ్రామాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. కవిటి మండలం చిను కర్రివానిపాలెం, ఇద్దివానిపాలెం, విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంలో సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 66.25 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
 
గార మండలం కళింగపటుంలో అత్యధికంగా 125.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గార, శ్రీకాకుళం, నరసనుపేట, కోటబమ్మాళి, ఎచ్చెర్ల, జలుమూరు, పోలాకి మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ఈ ప్రాంతాల్లోనిలోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
 
బలంగా వీస్తోను ఈదురుగాలలు ధాటికి పలాస మున్సిపాలిటీలోని రాజాం కాలనీ, శ్రీకూర్మం రోడ్డు మార్గంలో, మందస మండలం గంగువాడలో చెట్లు నేలకొరిగాయి. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట, బైపల్లి, ఎల్‌.డి.పేట, మెట్టూరు, పూడిలంక గ్రామాలకు చెందిన 182 మందిని సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments