టిటిడి భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపీఎస్‌లకు అవగాహన

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (13:55 IST)
దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన 24 మంది ట్రైనీ ఐపిఎస్ అధికారులకు టిటిడి సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు కలిసి భద్రతా వ్యవస్థపై అవగాహన కల్పించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రైనీ ఐపిఎస్‌ల బృందంలో నేపాల్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు.
 
ఈ సందర్భంగా టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం కార్యకలాపాలు, తిరుమల భద్రతకు సంబంధించి అర్బన్ పోలీసులు తీసుకునే చర్యలను వివరించారు.
 
అంతకుముందు ట్రైనీ ఐపీఎస్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్లు తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల భద్రతకు సంబంధించి టిటిడి అవలంబిస్తున్న విధానాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజిఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments