Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామానుజ సహస్రాబ్ది వేడుకల కోసం నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళతారు. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌ శ్రీరామ నగరులో ఉన్న శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రయానికి చేరుకుంటారు. 
 
ఇక్కడ జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన సమతామూర్తి విగ్రహంతో పాటు ఇక్కడ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను సందర్శించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆయన రాత్రి 8 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి రాత్రి 9.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి వస్తారు. 
 
అలాగే, ఈ నెల 11వ తేదీన కూడా సీఎం జగన్ మరోమారు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు వివాహానికి ఆయన హాజరవుతారు. సీఎం పర్యటనలకు  సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments