Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాధ శవాలకు అన్నీతానై తిరుపతి ఎమ్మెల్యే అంత్యక్రియలు

Webdunia
గురువారం, 13 మే 2021 (19:21 IST)
కరోనా లాంటి ప్రాణాంతక మహమ్మారి బారినపడి మరణిస్తే సొంత కుటుంబ సభ్యులే రాని పరిస్థితి. అలాంటిది అనాధలైతే. ఇక చెప్పనవసరం లేదు. గత రెండురోజులుగా కరోనాతో మృతి చెందిన ఏడుగురి అనాధ శవాలకు దగ్గరుండి మరీ అంత్యక్రియలు చేశారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ స్మశానవాటికలో మృతదేహాలను స్వయంగా మోసుకొచ్చి అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రస్తుత సమయంలో మానవత్వం చూపించాల్సిన సమయం వచ్చిందని.. కరోనా కారణంగా మృతి చెందిన వారి మృతదేహాలను అనాధలుగా వదిలేయడం మంచిది కాదన్నారు.
 
కరోనా అన్నది మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అతిగా భయపడాల్సిన జబ్బు కాదు. భయమే మనల్ని చంసేస్తుందని గ్రహించాలి. మనలో మానవత్వం వెల్లివిరిసి చనిపోయిన వారి మృతదేహాలు తీసుకెళ్ళాలనే ఆలోచన అందరిలో రావాలి. దైవ కార్యక్రమంగా భావించి ఏడుగురి అనాధ మృతదేహాలకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. 
 
గతంలో కూడా తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన 31 మంది అనాధ శవాలకు కూడా భూమన కరుణాకర రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని మార్చురీ నుంచి మృతదేహాలను మోసుకొచ్చి కరకంబాడి రోడ్డులోని స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు తిరుపతి ఎమ్మెల్యే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments