Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్న 150 మంది 21 మంది మృతి.. ఎక్కడ?

Advertiesment
Covid Positive Man
, శనివారం, 8 మే 2021 (17:23 IST)
కరోనా వైరస్ సూపర్ స్పైడర్‌గా మారుతోంది. ఒకర నుంచి అనేకమందికి అంటే పదుల సంఖ్యలో ఈ వైరస్ సోకుతోంద. తాజాగా ఓ కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్న 21 మందికి ఈ వైరస్ సోకింది. దీనికి కారణం కరోనా నిబంధనలను తుంగలో తొక్కడమే. కొవిడ్‌-19 సోకిన రోగి అత్యంక్రియల్లో కరోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఖ‌న‌నం చేసిన ఘ‌ట‌న‌లో 21 మంది మృత్యువాత‌ప‌డ్డారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. 
 
ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా నాలుగు మ‌ర‌ణాలు మాత్ర‌మే సంభ‌వించిన‌ట్లు అధికారులు తెలిపారు. మిగ‌తావారు వ‌యోభారం కార‌ణంగా చనిపోయిన‌ట్లు వెల్ల‌డించారు.
 
ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత నెల 21వ తేదీన కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఆయన మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో ఆయనకు మంచి పలకుబడివుండటంతో పాటు.. మంచి వ్యక్తి కూడా. దీంతో ఆయన అంత్య‌క్రియ‌ల్లో సుమారు 150 మంది పాల్గొన్నారు. 
 
అయితే, వీరంతా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో నుంచి బయటకు తీసిన‌ట్లు, ఖననం చేసే సమయంలో చాలా మంది దానిని తాకినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం 21 మరణాలలో కేవ‌లం ముగ్గురు లేదా న‌లుగురు మాత్ర‌మే కొవిడ్‌-19తో చ‌నిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 
 
కొవిడ్‌-19తోనే మ‌ర‌ణించారా? లేదా అని తెలుసుకునేందుకు తాము 147 కుటుంబాల నుండి శాంపిల్స్‌ను సేక‌రించిన‌ట్లు అధికారులు తెలిపారు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో శానిటైజేష‌న్ డ్రైవ్‌ను చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. అదేవిధంగా స‌మ‌స్య తీవ్ర‌త‌ను గురించి గ్రామస్థుల‌కు వివ‌రించడం జ‌రిగింద‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నలుగురు సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌