Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఎల్ఈడీ స్క్రీన్‌పై సినిమా పాట

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (09:44 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఉండే ఎల్ఈడీ స్క్రీన్‌లపై శ్రీవారికి సంబంధించిన పాటలు, వీడియోలు మాత్రమే ప్రసారం చేయాల్సివుంది. కానీ, ఉన్నట్టుండి తాజాగా ఓ సినిమా పాట ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన శ్రీవారి భక్తులు విస్తుపోయారు. ఇది వైరల్ కావడంతో తితిదే ఈవో ధర్మారెడ్డి స్పందించారు. 
 
బ్రాడ్‌కాస్ట్ ఉద్యోగి స్నేహితుడి కారణంగా ఈ సమస్య తలెత్తినట్టు చెప్పారు. విచారణ అనంతరం బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు ప్రసారం కావడాన్ని తొలుత సాంకేతికంగా సమస్యగా భావించారు. అయితే, ప్రాథమిక విచారణ తర్వాత బ్రాడ్‌కాస్టింగ్ ఉద్యోగి స్నేహితుడే ఇందుకు కారణని తేలింది. 
 
ఉద్యోగి తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్ గదిలోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత అతని స్నేహితుడిని అక్కడే ఉంచి వేరే పనిపై వైకుఠం-2 వరకు ఉద్యోగి వెళ్లినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో బ్రాడ్‌కాస్ట్ గదిలో ఉన్న అతడి స్నేహితుడు అక్కడ ఉన్న రిమోట్‌తో ఆపరేట్ చేయడంతో సినిమా పాటలు ప్రసారమైనట్టు ధర్మారెడ్డి వివరించారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన  వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments