కరోనావైరస్‌ను జయించిన పెద్దజీయంగార్లు

Webdunia
గురువారం, 30 జులై 2020 (14:13 IST)
శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చక స్వాములతో పాటు ఆలయ పెద్దజీయంగార్లకు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఇప్పటికే అర్చకులు కోలుకుని త్వరలోనే స్వామి వారి సేవలో పాల్గొననునున్నారు. ఇక పెద్ద జీయంగార్లను చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా సాధారణ వుంది.
 
కరోనాను జయించిన జియ్యంగార్లు తిరుమల మఠానికి ఆగస్ట్ 1న రానున్నారు. ఇక తిరుమల శ్రీవారి సమాచారం చూస్తే... గురువారం శ్రీవారిని 6278 మంది భక్తులు దర్శించుకోగా తలనీలాలు 2248 మంది సమర్పించారు. హుండీ ఆదాయం 52 లక్షలు. నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
 
ఇవాళ పవిత్ర ప్రతిష్ట, రేపు పవిత్ర సమర్పణ ఎల్లుండి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఇక ఆన్లైన్‌లో శ్రీవారి కళ్యాణోత్సవం సేవను నిర్వహించేందుకు ఏర్పాట్లు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్లో టిక్కెట్లును కోనుగోలు చేసిన భక్తులు ఆన్లైన్‌లో సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది.

అంతేకాదు కళ్యాణం లడ్డూ, వడ, వస్త్రాలను కొరియర్ ద్వారా భక్తులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నేటి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కారణంగా శ్రీవారి కళ్యాణోత్సవం సేవను రద్దు చేసింది టిటిడి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments