Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సర్కారుకు షాకిచ్చిన కృష్ణా బోర్డు

Webdunia
గురువారం, 30 జులై 2020 (14:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డు తేరుకోలేని షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కృష్ణాబోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ పథకానికి సంబంధించి ముందుకెళ్లొద్దని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు పూర్తి నివేదికను సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.
 
కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికను పంపాలని... అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంపై నీళ్లు చల్లినట్టైంది. 
 
కాగా, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, తమతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఆ ఎత్తిపోతల పథకాన్ని ఎలా చేపడుతారంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించి, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments