Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సర్కారుకు షాకిచ్చిన కృష్ణా బోర్డు

Webdunia
గురువారం, 30 జులై 2020 (14:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డు తేరుకోలేని షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కృష్ణాబోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ పథకానికి సంబంధించి ముందుకెళ్లొద్దని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు పూర్తి నివేదికను సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.
 
కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికను పంపాలని... అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంపై నీళ్లు చల్లినట్టైంది. 
 
కాగా, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, తమతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఆ ఎత్తిపోతల పథకాన్ని ఎలా చేపడుతారంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించి, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments