Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు త్వరపడండి, దర్సనం టిక్కెట్లు పెంపు, ఎన్ని విడుదల చేశారంటే?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (17:27 IST)
తిరుమల శ్రీవారి దర్సన టిక్కెట్ల సంఖ్యను పెంచింది తిరుమల తిరుపతి దేవస్థానం. అదనంగా మరో మూడు వేల టిక్కెట్లను ఆన్ లైన్లో అందిస్తోంది. ఇప్పటివరకు 6,750 టోకెన్లు మాత్రమే ఆన్ లైన్‌తో పాటు తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంచింది. అయితే ఈ రోజు నుంచి 9,750 టిక్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఆన్ లైన్లో నేటి నుంచి అదనంగా మరో మూడువేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులకు అందజేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రోజుకు 3 వేల అదనపు కోటా 300 రూపాయల ఆన్లైన్ దర్సన టిక్కెట్లను విడుదల చేసింది టిటిడి. ప్రతి స్లాట్‌కు 250 టిక్కెట్ల చొప్పున 12 స్లాట్స్ కేటాయించింది.
 
శుక్రవారం మాత్రం 10 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉంచనుంది. భక్తులు తిరుపతి బాలాజీ. ఎపి.జిఓవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ టిక్కెట్లు పొందే అవకాశం ఉంది. లాక్ డౌన్ 5.0 సడలింపుల తరువాత ఈ నెల 10వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లోను, ఆన్ లైన్లోను టిక్కెట్లను అందిస్తోంది టిటిడి.
 
అయితే విడతల వారీగా భక్తుల రద్దీని పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు టిటిడి ఛైర్మన్ ప్రకటించిన విధంగానే తొమ్మిది రోజుల తరువాత మరో 3 వేల టిక్కెట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది టిటిడి. ఆన్లైన్లో ఇప్పటికే టిక్కెట్లను భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు. స్వామివారిని దర్సనం చేసుకోవాలనుకునే వారు తొందరపడి ఆన్ లైన్ బుక్ చేసుకోవాల్సిందేనంటున్నారు టిటిడి అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments