Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వ్యాపార సంస్థల‌ స‌మ‌యం కుదింపు

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:23 IST)
కరోనా ఉధృతి దృష్ట్యా నగరంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న నేప‌ధ్యంలో ఈ నెల 28 నుంచి వ్యాపార సంస్థలన్నీ మధ్యాహ్నం 2గంటల వరకే నిర్వహించాలని విజయవాడ చాంబర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు విజ్ఞప్తి చేశారు.

ఈ సంద‌ర్భంగా సోమవారం గాంధీనగర్  ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు (షాపులు) పూర్తిగా తెరచి ఉంచి వ్యాపారం నిర్వహించుట శ్రేయస్కరం కాదన్నారు.

ప్రజల, వ్యాపారస్తులు, వివిధ సంఘాలు, ముఠా కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపారులు స్వియ నియంత్రణతో ఖచ్చితంగా షాపులు 2 గంటల వరకూ మాత్రమే తెరచి వుంచి వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరారు.

కరోనా వలన మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని అందుచేత‌ వ్యాపారులు కరోనా నిబంధనలు తప్పక పాటించి నిర్ణీత సమయం వరకు మాత్రమే వ్యాపారాల‌ను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్సి పి.యస్.ఎల్.ఎన్.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments