Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:00 IST)
క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ళే భ‌క్తుల‌కు ఇంకా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఘాట్ రోడ్డుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఎంత‌గా అభివృద్ధి ప‌రిచినా, మ‌ధ్య‌లో అర‌ణ్యాలు నుంచి వ‌స్తున్న క్రూర‌మృగాలు భ‌క్తుల ద‌ర్శ‌నానికి అవ‌రోధంగా మారుతున్నాయి. తాజాగా తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం భ‌క్తుల వెన్నులో చ‌లి ప‌ట్టిస్తోంది.

ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద సంచరించిన చిరుతను ప‌లువురు ప్ర‌యాణికులు ప్ర‌త్య‌క్షంగా చూశారు. కొంద‌రు త‌మ సెల్ ఫోన్ లో చిరుత పులి దృశ్యాలను బంధించారు. భక్తులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అప్రమత్తం అయి, సైరన్ మోగించి భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. చిరుతను అటవీ ప్రాంతంలోనికి పంపించే ప్రయత్నం చేసిన అటవీ శాఖ సిబ్బంది, కొద్ది రోజులు ఈ మార్గంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments