Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గుగుడిలో అవినీతికి ఆ ఇద్దరే ప్రధాన కారకులు: కేశినేని నాని

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:17 IST)
దుర్గగుడిలో చిరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయటం సరికాదని ఎంపీ కేశినేనా నాని అన్నారు. దుర్గుగుడిలో జరిగిన అవకతవకలు అవినీతికి  ప్రధాన కారకులు మంత్రి వెల్లంపల్లి, ఈఓ సురేష్‌ బుబు అని ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉందని...మంత్రి వెల్లంపల్లి గుడులు, దేవాలయాలను దోచుకుంటున్నారని...మూడు రోజులు జరిగిన ఏసీబీ దాడుల్లో అది రుజువైందని అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదని వ్యాఖ్యానించారు.

కేంద్రం నుంచి తాను నిధులు తెప్పించుకుని విజయవాడను అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలపై పన్నులు వేయటానికే తప్ప అభివృద్ధి మాత్రం వైసీపీ పట్టించుకోవటం లేదని కేశినేని నాని విమర్శించారు. 
 
దుర్గగుడిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. దుర్గగుడి అవినీతి విచారణతో అంత మందిని సస్పెండ్ చేసి అసలు సామ్రాట్‌ను వదలడం స్వామి వారి ఆశీస్సులతోనేనా? అని ప్రశ్నించారు.

ఈ దెబ్బతో స్వామి వారి గొప్పదనం రాష్ట్రమంతా పాకిందన్నారు. ఇక అవినీతిపరులంతా స్వామీజీని ఆశ్రయిస్తారేమో చూడాలని వ్యాఖ్యానించారు. అధర్మం రాష్ట్రంలో విజయపధంలో నడుస్తుందిగా? అంటూ వర్ల రామయ్య యెద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments