Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ సుధాకర్ పై చర్యలు తీసుకోవడానికి కారణం ఇదే: మంత్రి అవంతి

Webdunia
శనివారం, 23 మే 2020 (22:28 IST)
వైజాగ్ కు చెందిన డాక్టర్ సుధాకర్ పై వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విధులను సక్రమంగా నిర్వహించనందువల్లే ఆయనపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

డాక్టర్ అంశాన్ని టీడీపీ అధినేత రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన పనులన్నింటినీ ముఖ్యమంత్రి జగన్ ఏడాది కాలంలోనే పూర్తి చేశారని అన్నారు.

కరోనా సమయంలో సైతం సంక్షేమ పథకాలతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, రైతు భరోసా తదితర పథకాలను అమలు చేశారని చెప్పారు.
 
నాయకుడికి కావాల్సింది అనుభవం, వయసు కాదని... జగన్ లాంటి పెద్ద మనసు అని అవంతి అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు.

ఎలాంటి దెబ్బనైనా ఎదుర్కోగల శక్తి జగన్ కు ఉందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని... బషీర్ బాగ్ ఘటనను జనాలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments