Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజు: మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:44 IST)
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులందరూ తీవ్ర దిగ్బ్రాంతిని  వ్యక్తం చేసారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ గుండె బద్దలైనట్టుగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని చెప్పారు.
 
బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తను ఎన్నో మధురమైన పాటలను అందించారని, నా విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ఘంటశాల గారికి వారసుడిగా ఎవరొస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో బాలు గారు ధ్రువతారలా దూసుకొచ్చారని చిరంజీవి అన్నారు.
 
తన మధురమైన గానంతో భాష, సంస్కృతిల సరిహద్దులను చెరిపి వేశారని చెప్పారు. దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారని తెలిపారు. బాలు గారి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని తన మరణం ద్వారా ఏర్పడిన శూన్యాన్ని పునర్జన్మ ద్వారా ఆయనే భర్తీ చేస్తారని చెప్పారు. బాలు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరూలని మెగాస్టార్ ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments