Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో సిగరెట్లు దోచుకెళ్లిన దొంగలు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (17:04 IST)
జిల్లాలో మండల కేంద్రమైన బత్తలపల్లిలో శనివారం రాత్రి రెండు ఇళ్లు, రెండు దుకాణాలు చోరీ జరిగింది. కదిరిరోడ్డులోని జాతీయరహదారికి అనుకోని ఉన్న రెండు ఇళ్లు, రెండు దుకాణాల్లో గుర్తుతెలియని దుండుగలు చోరీకి పాల్పడ్డారు.
 
బాధితుడు తెలిపిన వివరాల మేరకు కదిరి రోడ్డులోని నివాసం ఉంటున్న గోవర్దన మరో ఇంటిలో నిద్రిస్తుండగా దుండుగలు తాళం వేసిన ఇంటిని బద్దలుకొట్టి రూ.30 వేలు నగదు, 30 తులాల వెండి, 25 వేల విలువ చేసే సిగరెట్లు దోచుకెళ్లారు. 
 
ఆ ఇంటిపక్కన ఉన్న మరో ఇంటిలో రెండు బంగారు ఉంగరాలు, 18తులాల వెండి, మరో దుకాణంలో రూ.10వేల విలువ చేసే సిగరెట్లు, మరో కూల్‌డ్రింక్స్‌ దుకాణంలో నగదు లభ్యం కాకపోవడంతో కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
 
తెల్లవారజామున చూడగా ఇళ్లల్లో దొంగతనం జరిగిన విషయాన్ని చూసి లబోదిబోమన్నారు. 
నిత్యం వాహనాలు తిరిగే ప్రధాన రహదారిలో చోరి జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.   ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments