Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో సిగరెట్లు దోచుకెళ్లిన దొంగలు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (17:04 IST)
జిల్లాలో మండల కేంద్రమైన బత్తలపల్లిలో శనివారం రాత్రి రెండు ఇళ్లు, రెండు దుకాణాలు చోరీ జరిగింది. కదిరిరోడ్డులోని జాతీయరహదారికి అనుకోని ఉన్న రెండు ఇళ్లు, రెండు దుకాణాల్లో గుర్తుతెలియని దుండుగలు చోరీకి పాల్పడ్డారు.
 
బాధితుడు తెలిపిన వివరాల మేరకు కదిరి రోడ్డులోని నివాసం ఉంటున్న గోవర్దన మరో ఇంటిలో నిద్రిస్తుండగా దుండుగలు తాళం వేసిన ఇంటిని బద్దలుకొట్టి రూ.30 వేలు నగదు, 30 తులాల వెండి, 25 వేల విలువ చేసే సిగరెట్లు దోచుకెళ్లారు. 
 
ఆ ఇంటిపక్కన ఉన్న మరో ఇంటిలో రెండు బంగారు ఉంగరాలు, 18తులాల వెండి, మరో దుకాణంలో రూ.10వేల విలువ చేసే సిగరెట్లు, మరో కూల్‌డ్రింక్స్‌ దుకాణంలో నగదు లభ్యం కాకపోవడంతో కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
 
తెల్లవారజామున చూడగా ఇళ్లల్లో దొంగతనం జరిగిన విషయాన్ని చూసి లబోదిబోమన్నారు. 
నిత్యం వాహనాలు తిరిగే ప్రధాన రహదారిలో చోరి జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.   ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments