Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు మాజీ మంత్రి బాలినేని దూరం దూరం...

Webdunia
ఆదివారం, 7 మే 2023 (09:39 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి బాగా దూరమైపోయినట్టు తెలుస్తుంది. తాజాగా ఒంగోలులో ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు లేకపోవడం ఇపుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీశాయి. ఇటీవల వైకాపా కో ఆర్డినేటర్ పదివి నుంచి తప్పుకున్న బాలినేని.. ఇటీవల ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తనపై పార్టీలోని వారే విమర్శలు చేస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్న విషయం తెల్సిదే. ఇపుడు జగన్ ఫ్లెక్సీలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
వేసవి నేపథ్యంలో ఒంగోలు నగరపాలక కార్యాలయం, ప్రకాశం భవన్, మార్కెట్ సెంటర్, రిమ్స్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస రెడ్డి వీటిని ప్రారంభించాల్సివుంది. కానీ, వివిధ కారణాలతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదాపడింది. అయితే, ఆయా చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్లీల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు లేకపోవడంతో రాజకీయ చర్చకు తెరలేసింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే పార్టీతో ఆయనకు దూరం పెరిగినట్టుగా ఉందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments