Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్త నిధుల కోసం ఆలయ కలశాన్ని ధ్వంసం చేసిన దుండగులు, ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (13:00 IST)
ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ వీరభద్రస్వామి ఆలయ కలశాన్ని గుప్తనిధుల కోసం ధ్వసం చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ జరిగిన ఘటనపై స్పందిస్తూ, స్థానిక సీఐలు ఆలయాన్ని సందర్శించారని తెలిపారు. ఆలయ గోపురంపై ఉన్న కలశానికి పసుపు కుంకుమలతో పూజలు చేసి, చుట్టూ ఉన్న కాంక్రీట్లను పగలకొట్టి కలశాన్ని తొలగించారని ఆయన స్పష్టం చేశారు.
 
గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని, ఆలయ కలశాన్ని ప్రతిష్టించిన వేళ అక్కడేమైనా నిధిని దాచి ఉండవచ్చునని భావించిన దుండగులు ఆ పనికి పాల్పడ్డారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. నిందితులను గుర్తిచేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు.
 
తర్లుపాడులో ఆ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందడంతో ఏటా జరిగే ప్రత్యేక ఉత్సవాలకు కర్నూలు, గుంటూరు తదితర ప్రాంతాల నుండి ప్రజల పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆలయ కలశాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, బీజేపీ నేతలు ధర్నాలకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగులను త్వరగా పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments