Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దివ్యను వాడుకుని చంపేశాడా? నాగేంద్ర బాబుపై ఆరా!!

Advertiesment
Vijayawada
, ఆదివారం, 18 అక్టోబరు 2020 (17:30 IST)
విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్వని హత్య కేసులోని మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. తామిద్దరం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలోనే భాగంగా ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన దివ్య ప్రియుడు నాగేంద్ర.. ఆ తర్వాత నాగేంద్రకు, దివ్యకు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. పైగా, ఈ ఆడియోలో నాగేంద్రను దివ్య తిడుతూ కనిపించింది. ఫలితంగా ఈ కేసులో ఏదో మిస్టరీ దాగివుందనే కోణంలో పోలీసులు అనుమానిస్తూ, ఆ మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. 
 
ముఖ్యంగా, ఈ కేసులో నిందితుడు నాగేంద్రబ చెప్పినదానికి, దివ్య తేజస్విని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకి వ్యత్యాసం ఉండటంతో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నాగేంద్రబాబు టార్చర్‌పై దివ్య తేజస్విని ఆవేదన వ్యక్తం చేయడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. దీంతో దివ్యతేజస్వినికి క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవర్స్ ద్వారా పలు వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 
 
దివ్యతేజస్విని, నాగేంద్రబాబు మధ్య తలెత్తిన విభేదాల అనంతరం నాగేంద్రబాబుతో దివ్య ఫ్రెండ్స్ ఎవరెవరు బాగా సన్నిహితంగా మెలిగారన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరిగిన ప్రదేశంలో నాగేంద్రబాబుతో పాటు అతని స్నేహితులు ఇంకెవరైనా ఉన్నారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి అయ్యాక కూడా బలాత్కారం... భరించలేక చంపేసిన మహిళ...!