Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (08:42 IST)
లోక్ సభలో బుధవారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు గురించి ప్రశ్నించారు. గత 50 రోజులుగా కర్నూలు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్న విషయాన్ని కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు  తెలిపారు.

వారి ఆకాంక్షల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని కోరారు. దానికి కేంద్ర న్యాయశాఖ న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా  జవాబిస్తూ ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగం ప్రతిపాదిస్తోందని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో  2019 జనవరి 1న హైకోర్టు ఏర్పాటు అయిందని తెలిపారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైకోర్టు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments