Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (08:42 IST)
లోక్ సభలో బుధవారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు గురించి ప్రశ్నించారు. గత 50 రోజులుగా కర్నూలు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్న విషయాన్ని కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు  తెలిపారు.

వారి ఆకాంక్షల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని కోరారు. దానికి కేంద్ర న్యాయశాఖ న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా  జవాబిస్తూ ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగం ప్రతిపాదిస్తోందని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో  2019 జనవరి 1న హైకోర్టు ఏర్పాటు అయిందని తెలిపారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైకోర్టు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments