వర్షం పెళ్ళిని చెడగొట్టింది, పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురు వాన నీటిలో?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (21:57 IST)
ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేము. వాతావరణాన్ని బట్టి వర్షం పడుతుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం వివాహాలు బాగానే జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో బంధువులను పిలిపించుకుని వివాహాలు చేసుకుంటున్నారు. సెకండ్ వేవ్ కరోనాలో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
 
అయితే కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో నిన్న సాయంత్రం ఒక వివాహం జరగాల్సి ఉంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఆధోని, మంత్రాలయం వాగులు వంకలు పొర్లుతున్నాయి. నల్లవంగ వాగు పొంగి పొర్లడంతో ఇంట్లోకి నీళ్ళు వచ్చి చేరాయి.
 
స్థానికులు వర్షపు నీటితో ఇబ్బందులు పడ్డారు. మంత్రాలయంలోని కర్ణాటక గెస్ట్ హౌస్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే నిన్న రాత్రి మొత్తం నీళ్ళు గెస్ట్ హౌస్ సెల్లార్ లోకి వచ్చేశాయి. కుర్చీలన్నీ మునిగిపోయాయి. చేసిన భోజనం మొత్తం నీటిలోనే మునిగిపోయింది. 
 
దీంతో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుతో పాటు బంధువులు మండపం రెండవ అంతస్తుపైకి ఎక్కి తలదాచుకున్నారట. ఈరోజు ఉదయం అయినా వరదనీరు తగ్గుతుందని అనుకున్నారు. ఉదయం ముహూర్తం కావడంతో నీటి ఉదృతి తగ్గితే పెళ్ళి చేసుకుందామనుకున్నారట. 
 
కానీ నీటి ఉదృతి ఏ మాత్రం తగ్గకపోవడంతో చివరకు వారు పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారట. పెళ్ళికి వచ్చిన బంధువుల బట్టలు, పెళ్ళికి ఇవ్వాల్సిన సామాన్లన్నీ కూడా వరదనీటిలో కొట్టుకుపోయాయట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments