Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమించలేదనే కోపంతో గంజాయి కేసులో ఆమెను ఇరికించాడు.. చివరికి..?

ప్రేమించలేదనే కోపంతో గంజాయి కేసులో ఆమెను ఇరికించాడు.. చివరికి..?
, ఆదివారం, 27 జూన్ 2021 (16:51 IST)
మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. అత్యాచారాలు, లైంగిక దాడులు, వరకట్న వేధింపులు ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నెన్నో అఘాయిత్యాలు మహిళలపై జరుగుతూనే వున్నాయి. తాజాగా తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ ప్రబుద్ధుడు సినిమా రేంజ్‌లో స్కెచ్ వేసి ఆమెను ఇబ్బందుల‌కు గురిచేశాడు. తన ప్రేమను కాదన్న యువతిని ఏకంగా జైల్లోనే పెట్టించాల‌నుకున్నాడు. గంజాయి కేసులో ఇరికించి ఆమెను మాన‌సికంగా ఇబ్బందిపెట్టాడు. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. 
 
వివ‌రాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని వళుతకాడ్​లో ‘వీవర్స్​ విలేజ్​’ పేరుతో బిజినెస్ ర‌న్ చేస్తున్నారు శోభా విశ్వనాథ్​. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు. ఆమెకు తిరువనంతపురంలోని లార్డ్స్​ హాస్పిట‌ల్‌ సీఈఓ హరీశ్​​ హరిదాస్​తో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు హరీశ్​. అందుకు ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి హరీశ్​ను కాస్త దూరం పెట్టింది.
 
దీంతో శోభపై కోపం పెంచుకున్న హరీశ్​.. ఆమెను క‌ట‌క‌టాల‌పాలు చేయాల‌నుకున్నాడు. పక్కా స్కెచ్ వేశాడు. ఆమె దగ్గర పనిచేసే వివేక్​ రాజ్​ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జనవరి 21న, యువతికి చెందిన షాపులో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 
 
మాదక ద్రవ్యాల అక్రమ నిల్వ కేసులో ఆమెను అరెస్ట్​ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె ఎంత చెప్పినా ఎవ‌రూ విన‌లేదు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు పెద్ద యుద్ధమే చేశారు ఆమె. ఈ కేసును సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కేసును క్రైమ్​ బ్రాంచ్​కు అప్పగించారు.
 
కేసును దర్యాప్తు చేపట్టిన క్రైమ్​ బ్రాంచ్​.. శోభా విశ్వనాథ్​ను నిర్దోషిగా తేల్చారు. ఆమె షాప్​లో కావాలనే గంజాయి ఉంచి.. కేసులో ఇరికించారని గుర్తించారు. ఆమెపై ఉన్న అన్ని ఆరోపణలను నిజ‌మైన‌వి కావ‌ని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 మామిడి పండ్లను అమ్మి ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనింది.. ఎలా..?