Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుండీలు నిండిపోయాయి, కానుకలు వేయొద్దన్న వేములవాడ ఆలయ సిబ్బంది

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (18:01 IST)
హుండీలు నిండాయని భక్తుల నుంచి కానుకలు తీసుకోని ఘటన వేములవాడ రాజన్న ఆలయంలో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం గర్భగుడి ఆవరణలోని హండీలు నిండాయని ఆలయాధికారులు భక్తుల నుంచి కానుకలు స్వీకరించలేదు. దాంతో భక్తులు తమ కానుకలను ఆలయంలో ఎక్కడబడితే అక్కడ సమర్పించారు.
 
ఆ కానుకలన్నింటిని ఆలయ సిబ్బంది తమ జేబుల్లో నింపుకున్నారు. ఆలయ సిబ్బంది నిర్వాకంతో వేలాది రూపాయల కానుకలు దుర్వినియోగమైనట్లు ఆరోపణపలు వస్తున్నాయి.
 కాగా.. ఈ ఘటనపై ఈఓ కృష్ణ ప్రసాద్ స్పందించారు.
 
బ్యాంక్ సిబ్బంది చిల్లర నాణాలు తీసుకోకపోవడంతోనే హుండీ లెక్కింపు ఆలస్యమైందని.. అందువల్లే హుండీలు నిండిపోయాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. వెంటనే నిండిన హుండీలను ఖాళీ చేయించి.. వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments