Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ప‌లువురు విరాళం

దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ప‌లువురు విరాళం
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (19:34 IST)
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అమ‌ల‌వుతున్న నిత్యాన్నదాన ప‌థ‌కానికి ప‌లువురు దాత‌లు శ‌నివారం విరాళాలు అందించారు. విజ‌య‌వాడ స‌మీపంలోని పెన‌మ‌లూరుకు చెందిన కిలారు వెంకయ్య చౌదరి రూ.1,01,116లు విరాళం ప్ర‌క‌టించారు.

కిలారు సబర్మతీ భాయి, బలరామారావు పేరున‌ అన్నదానం జ‌ర‌పాల‌ని పేర్కొంటూ విరాళం చెక్కును ఆలయ అధికారులకు అందించారు. అదేవిధంగా మ‌రొక దాత విజ‌య‌వాడ టిక్కిల్‌రోడ్డులో నివాసం ఉంటున్న మేకా విధ్యాధరి, డాక్ట‌ర్ ఎం.వై.నాయుడు నిత్యాన్న‌దానం నిమిత్తం రూ.1,01,116లు దేవస్థానానికి విరాళంగా ప్ర‌క‌టించి చెక్కును ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబును కలిసి అంద‌జేశారు.

అలాగే విజ‌య‌వాడ‌లోని విద్యాధ‌ర‌పురం కామ‌కోటిన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఇంకొక దాత ‌చిట్టి రామకృష్ణ రూ.1,01,116లు విరాళాన్ని ఆయ‌న ధర్మపత్ని వెంకటదుర్గా శేషుకుమారి పేరున నిత్యాన్న‌దానం నిమిత్తం దేవస్థానానికి విరాళంగా ప్ర‌క‌టించి ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబును క‌లిసి చెక్కు అందజేశారు.

అనంత‌రం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం క‌ల్పించి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవీఎల్‌, రాంమాధవ్‌, మురళీధర్‌రావుల‌పై వేటు.. టీడీపీ ఎఫెక్టేనా?