Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాన్ని ఢీకొట్టిన గూడ్స్ రైలు.. ప్రాణాలకు ప్రమాదం లేదు కానీ..?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:47 IST)
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా రాజులా పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు సింహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సింహం తీవ్రంగా గాయపడింది. ట్రాకర్స్‌ ద్వారా ప్రమాద సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని గాయపడ్డ సింహాన్ని బాబర్‌కోట్ రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తదుపరి ట్రీట్‌మెంట్ కోసం జునాగఢ్‌లోని సక్కర్‌బాగ్ జంతుప్రదర్శనశాలకు తరలించారు. 
 
ప్రమాదంలో సింహం తీవ్రంగా గాయపడిందని, అయితే దాని ప్రాణాలకు ప్రమాదమేమీ ఉండకపోవచ్చని, అది బతుకుతుందని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డీటీ వాసవద చెప్పారు. సింహం రాజులా అటవీ ప్రాంతానికి పిపవావ్ ఓడరేవుకు మధ్య సంచరిస్తుండగా ప్రమాదానికి గురైందని తెలిపారు.
 
అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రైళ్ల వేగాన్ని పరిమితం చేయాలని ప్రభుత్వం గతంలో రైల్వే అధికారులను కోరింది. 2018లో, ఆరు సింహాలు రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తున్నప్పుడు, అమ్రేలీకి చెందిన సావర్‌కుండ్ల తాలూకాలోని పిపావవ్-బొటాడ్ గూడ్స్ రైలులో చిక్కుకున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments