Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన శ్రీశైలం సొరంగ పనుల వ్యయం!

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (07:45 IST)
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు పనుల్లో భాగమైన డిండి జలాశయంతో పాటు ప్రధాన కాల్వ పనుల అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది.

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు పనుల్లో భాగమైన డిండి జలాశయంతో పాటు ప్రధాన కాల్వ పనుల అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది. డిండి, పెండ్లిపాక జలాశయం సహా ప్రధాన కాల్వ పనులు, మొదటి, రెండో లింక్ కాల్వ పనులకు సంబంధించిన అంచనా వ్యయాన్ని రూ. 521 కోట్ల నుంచి రూ. 1,764 కోట్ల 50లక్షలకు పెంచారు.

ఇందులో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల విలువను రూ. 242 కోట్ల నుంచి రూ. 1,147 కోట్లకు పెంచారు. పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సహా ప్రధాన కాల్వ పనుల విలువను రూ. 278 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు పెంచారు.

మొదటి లింక్ కాల్వకు రూ. 3.78 కోట్లు, రెండో లింక్ కాల్వకు రూ. 15.42 కోట్ల అంచనా వ్యయంగా ప్రతిపాదించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments