Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందో రోజుకు రాజధాని రైతుల ఉద్యమం

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (19:16 IST)
రాజధాని రైతుల ఉద్యమం వందో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాజధానిగా అమరావతి కొనసాగాలన్న రైతుల ఆకాంక్షను గ్రహించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా సంక్షోభ పరిస్థితుల్లో కూడా రైతుల ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. కరోనా నిరోధానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

కరోనా నిరోధానికి ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలిటరీ దేశం కోసం పోరాడుతున్న విధంగానే అమరావతి కోనం ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
 
అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులని అవమానించినా.. లాఠీ దెబ్బలు కొట్టినా రాజధాని గ్రామాల ప్రజలు సహనం కోల్పోదని కొనియాడారు.

‘‘జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుంది. పెయిడ్ ఆర్టిసులని అవమానించినా, లాఠీ దెబ్బలు కొట్టినా... వేల మందిని జైలుకి పంపినా సహనం కోల్పోలేదన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతిని కాపాడుకోవడానికి ముందుకొచ్చిన రైతులు, మహిళలకి ఉద్యమ వందనాలు’’ అని లోకేష్‌ ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments