Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వృద్ధురాలు పెన్షన్ కోసం రాలేదు, ఇంటివద్దే మరణించారు, అవాస్తవాలు నమ్మొద్దు: పల్నాడు జిల్లా కలెక్టర్

ఐవీఆర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:29 IST)
కర్టెసి-ట్విట్టర్
పెన్షన్లు కోసం ఎండల్లో పడిగాపులు కాస్తూ పలువురు వృద్ధులు మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తాము నడవలేని, కదల్లేనివారికి, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తామని చెబుతున్నారు. దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నెహ్రూ నగర్‌కు చెందిన వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి మరణించారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దు. ఆమె ఆరోగ్యం బాగాలేదు. రెండురోజులుగా ఇంటిలోనే వున్నారు. ఆరోగ్యం విషమించి ఇంటివద్దే ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంపిడివో దుర్గ ధృవీకరించారు. కనుక అవాస్తవాలను ఎవ్వరూ నమ్మవద్దు.
 
కదల్లేనివారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే పెన్షన్ ఇస్తాము. సచివాలయం సిబ్బంది ద్వారా సమాచారం ఇచ్చాము. సోషల్ మీడియా, ఛానళ్లులో వచ్చే వార్తలు అవాస్తవం.నడవలేని పరిస్థితుల్లో వున్నవారు సచివాలయం వద్దకు రావద్దు. రాబోయే 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఆందోళన, అధైర్యం పడవద్దు. అవాస్తవాలను నమ్మవద్దు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments