Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వృద్ధురాలు పెన్షన్ కోసం రాలేదు, ఇంటివద్దే మరణించారు, అవాస్తవాలు నమ్మొద్దు: పల్నాడు జిల్లా కలెక్టర్

ఐవీఆర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:29 IST)
కర్టెసి-ట్విట్టర్
పెన్షన్లు కోసం ఎండల్లో పడిగాపులు కాస్తూ పలువురు వృద్ధులు మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తాము నడవలేని, కదల్లేనివారికి, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తామని చెబుతున్నారు. దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నెహ్రూ నగర్‌కు చెందిన వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి మరణించారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దు. ఆమె ఆరోగ్యం బాగాలేదు. రెండురోజులుగా ఇంటిలోనే వున్నారు. ఆరోగ్యం విషమించి ఇంటివద్దే ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంపిడివో దుర్గ ధృవీకరించారు. కనుక అవాస్తవాలను ఎవ్వరూ నమ్మవద్దు.
 
కదల్లేనివారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే పెన్షన్ ఇస్తాము. సచివాలయం సిబ్బంది ద్వారా సమాచారం ఇచ్చాము. సోషల్ మీడియా, ఛానళ్లులో వచ్చే వార్తలు అవాస్తవం.నడవలేని పరిస్థితుల్లో వున్నవారు సచివాలయం వద్దకు రావద్దు. రాబోయే 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఆందోళన, అధైర్యం పడవద్దు. అవాస్తవాలను నమ్మవద్దు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments