Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు - ఎమ్మెల్యే వినూత్న నిరసన

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (16:00 IST)
వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీసారా మరణాలపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బుధవారం విజయవాడ నగరంలో ర్యాలీ తలపెట్టారు. అయితే, ఈ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 
 
అబ్కారీ కమిషనర్‌‍కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి బస్సులో వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలను ముందుగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ నుంచి కాలినడకన కమినర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వినతిపత్రం కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇదిలావుంటే, కల్తీ మద్యంతో అనేక మంది మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన తెలిపారు. చేతిలో మద్యం సీసా, తాళిబొట్టు పట్టుకుని ఎక్సైజ్ కార్యాలయం వరక్ ఊరేగింపులో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments