Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు - ఎమ్మెల్యే వినూత్న నిరసన

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (16:00 IST)
వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీసారా మరణాలపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బుధవారం విజయవాడ నగరంలో ర్యాలీ తలపెట్టారు. అయితే, ఈ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 
 
అబ్కారీ కమిషనర్‌‍కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి బస్సులో వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలను ముందుగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ నుంచి కాలినడకన కమినర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వినతిపత్రం కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇదిలావుంటే, కల్తీ మద్యంతో అనేక మంది మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన తెలిపారు. చేతిలో మద్యం సీసా, తాళిబొట్టు పట్టుకుని ఎక్సైజ్ కార్యాలయం వరక్ ఊరేగింపులో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments