Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు పడిపోయింది.. మాట్లాడేవారే కరువయ్యారు..

తెలుగు ప్రజలకు ఓ చేదువార్త. తెలుగు స్థానం దిగజారింది. దేశవ్యాప్తంగా తెలుగు భాషలో మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయింది. అవును దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదం నుంచి.. తెలుగు లెస్ అనేలా పరిస్థితి దిగజారి

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (10:36 IST)
తెలుగు ప్రజలకు ఓ చేదువార్త. తెలుగు స్థానం దిగజారింది. దేశవ్యాప్తంగా తెలుగు భాషలో మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయింది. అవును దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదం నుంచి.. తెలుగు లెస్ అనేలా పరిస్థితి దిగజారిపోయింది.


తాజా సర్వేలో ప్రస్తుత రోజుల్లో తెలుగు మాట్లాడటం బాగా తగ్గిపోయిందని తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న భాషల్లో.. దేశంలో అత్యధికంగా ప్రజలు హిందీ మాట్లాడుతున్నారని 2011 గణాంకాలు చెబుతున్నాయి. 
 
2001లో హిందీ మాట్లాడే వారి సంఖ్య 41.03శాతం కాగా, 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. జనాభా లెక్కల ప్రకారం 2.6 శాతం పెరుగుదల హిందీ మాతృభాషలో నమోదైతే… తెలుగు మాత్రం మూడో స్థానం నుంచి నాల్గో స్థానానికి దిగజారింది.
 
భారత్ రెండో పెద్దబాషగా బెంగాలీ అవతరించింది. ఇన్నాళ్లుగా మూడోస్థానంలో కొనసాగిన తెలుగును మరాఠి భర్తీ చేసింది. దేశంలో ఉన్న మొత్తం 22 ప్రాంతీయ భాషలో అట్టడుగున నిలిచింది సంస్కృతం. కేవలం 24 వేల 821 మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నట్లు వెల్లడి అయ్యింది. అమెరికాలో తెలుగు వారి సంఖ్య పెరిగిపోతుందని.. అక్కడ తెలుగుకు కూడా మూడో స్థానమే లభించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments