Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకటిపై వెలుగు సాధించిన విజయం : తెలుగు సీఎంల దీపావళి శుభాకాంక్షలు

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (09:02 IST)
చీకటిపై వెలుగు సాధించిన విజయం దీపావళి అని, ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు వేర్వేరుగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజల జీవితాల్లో ఆనందకాంతులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. 
 
ఇదే విషయంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకకగా దీపావళి పండుగను జరుపుకుంటారని తెలిపారు. 
 
ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నిండాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలలని అభిలషించారు. 
 
అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments