Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాణసంచా షాపులో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

fire accident
, ఆదివారం, 23 అక్టోబరు 2022 (13:06 IST)
దీపావళి సందర్భంగా విజయవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో ఆదివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 
 
ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలకు నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. మొత్తం పదిహేను దుకాణాలకు మంటలు వ్యాపించగా.. ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. 
 
దీపావళి నేపథ్యంలో విజయవాడలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్‌లో 20 బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. బాణసంచాకు నిప్పంటుకోవడంతో చుట్టుపక్కల దుకాణాలకూ మంటలు వ్యాపించాయి. 
 
భారీ శబ్దాలతో పేలుళ్లు, ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డ మంటలను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో జింఖానా గ్రౌండ్స్‌కు చేరుకుని మంటలను ఆర్పేశారు. 
 
అప్పటికే పదిహేను దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అందులో కొన్ని పూర్తిగా కాలిబూడిదయ్యాయని, ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారని పోలీసులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత ఆరోగ్యం.. ఆరుముగస్వామి కమిషన్‌ నివేదికలో విస్తుపోయే నిజాలు