పెళ్లికి నిరాకరించిన బాలికపై యువకుడి దాడి... ఫిరంగిపురంలో ఘటన...

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (08:53 IST)
గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిన ఓ యువతిపై యువకుడు కర్రలతో దాడి చేశాడు. ఇది పంచాయతీకి చేరగా, అక్కడ ఆ యువకుడి కుటుంబ సభ్యులు వీరంగం వేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిరంగిపురం గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలికకు వివాహం నిశ్చియమైంది. కానీ, అదే గ్రామంలోని పంతు వీధికి చెందిన మణికంఠ (23)ల అనే యువకుడు ఆ బాలికను ప్రేమిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ, ఆ బాలికను వేధిస్తూ వచ్చాడు. ఇది గ్రామ పెద్దలతో పాటు ఇరు కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. దీంతో సమస్య పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడుకుందాని చెప్పి గ్రామ పెద్దల సమక్షంలో సమావేశమయ్యారు.
 
తాను మణికంఠను పెళ్లి చేసుకోనని అందరి సమక్షంలో ఆ బాలిక తెగేసి చెప్పింది. పెద్దలు కుదిర్చిన వివాహాన్నే చేసుకుంటానని తెలిపింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో అది ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో బాలిక, అమె కుటుంబ సభ్యులపై మణికంఠ, అతని బంధువులు దాడికి దిగారు. 
 
ఈ ఘటనలో బాలికతో పాటు 11 మంది గ్యాపడ్డారు. వీరిలో 9 మందిని నరసారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలికతో పాటు ఆమె బంధువులను గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాలక ఫిర్యాదుతో మణికంఠ, అతని బంధువులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments