Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నిరాకరించిన బాలికపై యువకుడి దాడి... ఫిరంగిపురంలో ఘటన...

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (08:53 IST)
గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిన ఓ యువతిపై యువకుడు కర్రలతో దాడి చేశాడు. ఇది పంచాయతీకి చేరగా, అక్కడ ఆ యువకుడి కుటుంబ సభ్యులు వీరంగం వేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిరంగిపురం గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలికకు వివాహం నిశ్చియమైంది. కానీ, అదే గ్రామంలోని పంతు వీధికి చెందిన మణికంఠ (23)ల అనే యువకుడు ఆ బాలికను ప్రేమిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ, ఆ బాలికను వేధిస్తూ వచ్చాడు. ఇది గ్రామ పెద్దలతో పాటు ఇరు కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. దీంతో సమస్య పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడుకుందాని చెప్పి గ్రామ పెద్దల సమక్షంలో సమావేశమయ్యారు.
 
తాను మణికంఠను పెళ్లి చేసుకోనని అందరి సమక్షంలో ఆ బాలిక తెగేసి చెప్పింది. పెద్దలు కుదిర్చిన వివాహాన్నే చేసుకుంటానని తెలిపింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో అది ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో బాలిక, అమె కుటుంబ సభ్యులపై మణికంఠ, అతని బంధువులు దాడికి దిగారు. 
 
ఈ ఘటనలో బాలికతో పాటు 11 మంది గ్యాపడ్డారు. వీరిలో 9 మందిని నరసారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలికతో పాటు ఆమె బంధువులను గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాలక ఫిర్యాదుతో మణికంఠ, అతని బంధువులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments