Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో తెలుగు అకాడమీ, సాంస్కృతిక యూనివర్సిటీ: లక్ష్మీపార్వతి

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:26 IST)
తిరుపతిలో తెలుగు అకాడమీ, సాంస్కృతిక యూనివర్సిటీ నెలకొల్పనున్నట్లు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. తెలుగు అకాడమీ పుస్తకాల ముద్రణను పున:ప్రారంభించనునట్లు తెలిపారు.

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ఇంటర్మీడియేట్‌ పాఠ్యపుస్తకాలను అకాడమీ ముద్రించి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతుందన్నారు. తరువాత ఎంసెట్‌ పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తామని, మిగిలిన పుస్తకాలను దశలవారీగా ముద్రిస్తామని చెప్పారు.

అకాడమీ పుస్తకాలు అందుబాటులోకి లేకపోవడంతో ప్రైవేట్‌ కళాశాలలు సొంతంగా పుస్తకాలు ముద్రించి అధిక ధరకు విక్రయిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

రాష్ట్రవిభజన తరువాత తెలుగు అకాడమీకి రావాల్సిన నిధులు, ఇతర అంశాలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అకాడమీ నిధులు, భవనాలు విషయంలో కోర్టును ఆశ్రయించిందని తెలిపారు.

అకాడమీ నిధులు, భవనాలను రాష్ట్రానికి 58:42 నిష్పత్తిలో రెండు నెలల్లో పంపకాలు చేసుకోవాలని కోర్టు వారం క్రితం తీర్పునిచ్చిందన్నారు.

అదేవిధంగా పుస్తకాల ముద్రణ కోసం రూ.30కోట్లు ఇవ్వాలని తెలంగాణ తెలుగు అకాడమీకి ఇటీవల లేఖ రాశామని, దీనిపై ఇంతవరకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుపతిలో తెలుగు అకాడమీ, సాంస్కృతిక యూనివర్సిటీ నెలకొల్పనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments