Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించిన తెలంగాణ గవర్నర్ తమిళ్ సై

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (10:21 IST)
తెలంగాణ గవ ర్నర్, పుదుచ్చేరి ఇంచార్జి  గవర్నర్  తమిళ్ సై  సోమవారం ఉదయం తిరుపతి శ్రీ గోవింద రాజుల స్వామి ఆలయంను దర్శించుకున్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు ఆమెకు లాంఛ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆమె ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో స్వామివారికి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలో గోమాత‌కు పూజ చేసి, గోవుల‌కు అర‌టి పండ్లు స్వ‌యంగా తినిపించారు. 
 
 
తెలంగాణ గవర్నర్ కి స్వామి వారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వాదం చేశారు. అనంతరం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద గల ఆంజనేయ స్వామి వారిని కూడా గవర్నర్ దర్శించుకున్నారు. తిరుప‌తిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌మావేశానికి వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్, తిరుగు ప్రయాణం నిమిత్తం  రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి బయలుదేరి వెళ్లారు. అక్క‌డి నుంచి ఆమె నేరుగా హైద‌రాబాదుకు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments