Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ పోయిందనీ ఉరేసుకున్న యువకుడు

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:37 IST)
స్మార్ట్ ఫోన్ పోయిందనీ ఓ యువకుడు ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎస్సీ కాలనీకి చెందిన అశోక్ అనే 17 యేళ్ల యువకుడు తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
 
కూలీ పనులకు వెళ్లడం ద్వారా సంపాదించుకున్న డబ్బుతో ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే దాన్ని పొగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమనస్తాపానికుగురైన అశోక్, కుడిచేతిని బ్లేడుతో కోసుకున్నాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది. 
 
ఈ విషయాన్ని గమనించిన తల్లి ఇరుగుపొరుగు వారిద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్న అశోక్ తల్లి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో అశోక్ తల్లి జయమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments