Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలను ఎదిరించలేక పెళ్లి.. భర్తతో కాపురం చేయలేక ప్రియుడితో కలిసి ఆత్మహత్య...

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (12:02 IST)
తన మనసుకు నచ్చిన వ్యక్తిని ఓ యువతి నాలుగేళ్ళపాటు గాఢంగా ప్రేమించింది. కానీ ఎదిరించే ధైర్యం చేయలేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. కానీ మనసు చంపుకుని భర్తతో కాపురం చేయలేక పోయింది. ప్రియుడుతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని దేవరకద్ర మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భూత్పూర్ గ్రామానికి చెందిన కంప్లి మణెమ్మ, నర్సింహల కుమార్తె రామేశ్వరి (25), అదే గ్రామానికి చెందిన నాగరాజు (31) అనే వ్యక్తిని నాలుగేళ్ళుగా ప్రేమిస్తూ వచ్చింది. ఈ ప్రేమ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. పైగా, కుమార్తెకు మరో యువకుడుతో వివాహం జరిపించారు. 
 
ఇటు ప్రియుడుని మరచిపోలేక అటు మనస్సు చంపుకుని భర్తతో కాపురం చేయలేక వివాహమైన రెండు నెలలకే పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత రామేశ్వరి ప్రియుడితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో భర్తతో కాపురం చేయనని పుట్టింటిలోనే ఉండిపోయింది. కొన్ని నెలలు గడిచిన తర్వాత తల్లిదండ్రులు రామేశ్వరిని మెట్టినింటికి పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు గుర్తించింది. 
 
ఈ క్రమంలో ఆమె బుధవారం రాత్రి ప్రియుడు నాగరాజుతో కలిసి గ్రామ సమీపంలోని మోతుకుంట చెరువు సమీపంలో నబీసాబ్‌ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం వ్యవసాయ పొలాలకు వెళ్లే వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై రామేశ్వరి తండ్రి నర్సింహ భూత్పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments